26.7 C
Hyderabad
May 3, 2024 07: 50 AM
Slider గుంటూరు

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు పితృవియోగం

#MangalagiriMLA

గుంటూరు జిల్లా  మంగళ గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి దశరధరామిరెడ్డి(84) అనారోగ్యంతో బాధ పడుతూ గురువారం కన్ను మూశారు.

దశరధరామిరెడ్డి పెద్దకాకాని సర్పంచ్ గా,  శివాలయం చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి తో సన్నిహితంగా మెలిగే వారని, గుంటూరు జిల్లా పర్యటనకు వై ఎస్ వస్తే తప్పకుండా దశరధరామిరెడ్డి ని కలిసి వెళ్లే వారని చెబుతుంటారు.

వై ఎస్ మరణించే వరకూ కాంగ్రెస్ పార్టీలో తరువాత వై ఎస్ ఆర్ సి పి కి సేవలందిస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా అస్వస్థత కు గురి కావటంతో చికిత్స పొందుతూ గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు.

Related posts

రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి వాల్ పోస్టర్ విడుదల

Satyam NEWS

ఆదర్శ గ్రామాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు

Satyam NEWS

ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment