నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ హైవే పై చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాటర్ పైపు లైను ను ఢీకొట్టడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మల్లెపల్లి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో మొత్తం 5గురు ఉన్నారు. నిద్రమత్తులో అతివేగం గా వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.