సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయములో ఇటీవల బీహార్ లో జరిగిన రగ్బీ జాతీయ స్థాయి జూనియర్,సీనియర్ రగ్బీ పోటీలలో పాల్గొని నేషనల్స్ కు ఎంపికైన సూర్యపేట టీం క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి,క్రీడాకారులను సన్మానించినారు.
అనంతరం నేషనల్స్ కు ఎంపికైన రగ్బీ క్రీడాకారులు,రగ్బీ జిల్లా అధ్యక్షుడు గెల్లి రవి,ప్రధాన కార్యదర్శ కర్నాటి తరుణ్ రెడ్డి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ని ఘనంగా సన్మానించారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్