37.2 C
Hyderabad
May 6, 2024 11: 23 AM
Slider నల్గొండ

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

#mlasaidireddy

శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట పండుగ మహోత్సవ కార్యక్రమానికి  శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట పండుగ మహోత్సవంలో పాల్గొడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. స్వామివారి ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాల,మతాల వారి విశ్వాసాలను గౌరవిస్తుదని,సంక్షేమ పథకాల్లో గౌడ కులస్తులకు పెద్ద పీట వేస్తామని అన్నారు.

గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని,వృత్తి పని వారికి ఫించన్ లు,దురదృష్టవశాత్తు మృతి చెందిన, గాయ పడిన భీమా సౌకర్యం కల్పించిదని అన్నారు.ఎక్స్ గ్రేషియా కూడా ప్రభుత్వం పెంచిదని,గీత కార్మికులకు లైసెన్స్ లు చేసి కల్లు గీత వృత్తికి తోడ్పాటును అందిస్తూ ఉపాధి పెంచిదని అన్నారు.తాళ్ల పన్నును  రద్దు చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని సైదిరెడ్డి తెలిపారు. అనంతరం కమిటీ సభ్యుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని శానంపూడి ప్రారంభించారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మతిస్థిమితం లేని వృధ్ధురాలిని ఆదుకున్న లేడీ హోమ్ గార్డు

Satyam NEWS

ట్రాజెడీ: కదిరి పున్నమి పండుగలో పెను విషాదం

Satyam NEWS

కెసిఆర్ పాలనలో తెలంగాణ రైతులు దగా పడ్డారు

Satyam NEWS

Leave a Comment