ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్పకళా ప్రావీణ్యత దాని వెనుక ఉన్న సైన్స్, పోటోగ్రఫీ చరిత్ర గురించి అవగాహన కల్పించటం కోసం ఒక రోజును ఏర్పాటు చేశారు. ఫోటోగ్రాఫర్లు తమ ఫోటోలతో ప్రపంచంలోని అద్ఛుతాలను బంధించి వాటిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్పకళ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం.
ఈ క్రమంలోనే చింతపల్లి మండల ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీటి నగర్ మాల్ పట్టణంలో 181 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కెమెరాల ఉనికి ద్వారా ఫోటోగ్రఫీ కమ్యూనికేషన్ మాధ్యమాల చరిత్రను తెలియజేస్తోంది.
19వ శతాబ్దంలో ఫోటోగ్రఫీ ఒక వ్యక్తి తాను ఏవిధంగా ఒక స్థలాన్ని లేదా ఒక సంఘటనను లేదా క్షణాన్ని లేదా ఆలోచనని ప్రతిబింబిస్తోంది. అందువల్లే ఒక చిత్రం వెయ్యి పదాల అర్ధాన్ని వివరిస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కార్యదర్శి సందుపట్ల లక్ష్మణ్ సాగర్, చింతపల్లి మండల ప్రెసిడెంట్ కందుల శ్రీరాములు,శ్రీనివాస్, కృష్ణ, కాశీ ,శేఖర్, గిరి, రఘు, గణేష్ ,రాజు, తదితర ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.