37.2 C
Hyderabad
April 26, 2024 22: 50 PM
Slider ఖమ్మం

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?

#MalluBhatti

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది ప్రజల సమస్యలు తీర్చడానికా కేసీఆర్ కుటుంబ సభ్యుల సమస్యలు తీర్చుకోవడానికా అని మధిర ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం లో మార్నింగ్ వాక్  కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు.

ప్రత్యేక తెలంగాణ లో ప్రజల సమస్యలు పక్కనపెట్టి కెసిఆర్ కుటుంబ సమస్యలు తీసుకోవడం లోనే తలమునకలవుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారని, కొత్తగా తెచ్చిన చట్టాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం తో రైతులు  గ్రామాల్లో భయాందోళనలకు గురవుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ప్రజలు పండించిన పంటకు మద్దతు ధర, ఉద్యోగాలు, గ్రామాల్లో సమస్యను పరిష్కరించుకోవడం కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది… అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతున్నదని ఆయన అన్నారు.

 గ్రామాల్లో సమస్యలు తీర్చుకోవడంతోపాటు ,పెన్షన్లు ,ఇల్లు ఉద్యోగాలు , వస్తాయని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో  సమస్యలు తీరక ప్రజల్లో బాధ మాత్రమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

ఏపీలో ఏమీ జరగడం లేదు… అంతా ఎల్లోమీడియా ప్రచారమే

Satyam NEWS

ఘనంగా శ్రీ పురంధరదాసు ఆరాధనోత్సవాలు

Satyam NEWS

రాష్ట్రం లో మైనార్టీలకు రక్షణ లేదు: టిడిపి నాయకులు

Satyam NEWS

Leave a Comment