సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పలు వీధులలో పర్యటించారు.
స్వయంగా కోవిడ్ బాధితులను కలుస్తూ, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ, దైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రజలు అందరూ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలని,కాలనీ వాసులు అంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత, మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్,పోనుగోడు ఎంపీటీసీ వెంకట రమణ,రామ్ సైదులు TRS నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.