హుజుర్ నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా ఈరోజు హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అమరవీరుల శాంతి స్థూపనికి నివాళులర్పించి అనంతరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, పట్టణంలోని గ్రంధాలయంలో జెండా ను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కేసిఆర్ పోరాట కృషితో, అమరవీరుల బలిదానాలతో, తెలంగాణ ఏర్పడిందని, గతంలో సాధించలేని ప్రగతి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిందని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నో నూతన పథకాలు పెట్టి అమలు పరుస్తున్నారని,రైతే రాజన్న నిజం త్వరలో నెరవేరనుందని,పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారు అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్,జడ్పీటీసీలు,ఎంపీపీ లు,ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ లు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళ నాయకులు, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.