37.2 C
Hyderabad
April 30, 2024 11: 30 AM
Slider ముఖ్యంశాలు

క్రైస్తవ మిషనరీల సేవలు అభినందనీయం

#mla seetakka

క్రైస్తవ మిషనరీ లు  నిరుపేదలకు అందిస్తున్నా సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు సోమవారం ములుగు మండలం పరిధిలోని జంగాల క్రాస్ లో గల  చార్ల్స్ మేరీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఐ సి ఏం  హైదరాబాద్ వారి సహకారంతో చార్లెస్ రాజు అధ్యక్షతన 10 మంది వికలాంగులకు ఉచిత  విల్ చైర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సీతక్క విల్ చైర్లను  అందించారు.ఈ సందర్భంగా  సీతక్క  కార్యక్రమాన్ని ఉద్దెశించి మాట్లాడుతూ  క్రైస్తవ మిషనరీలు నిరుపేదల పట్ల చేస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మా  ప్రాంత వాసులకి ఎంతో అవసరమని అన్నారు. కార్య నిర్వాహకులైన చార్లెస్ రాజు  మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉదేశ్యం యేసుక్రీస్తు పలికిన మాటలే కారణమని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని అల్పులలో ఒకరికి సేవ చేస్తే నాకు చేసినట్టేనని యేసుప్రభు వారు చెప్పారని అందును బట్టియే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బంజరుపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజ శేఖర్ గారు. కూనూరు అశోక్ గారు, సంఘ పెద్దలు విశ్వాసులు పాల్గొన్నారు.

Related posts

“మన ఊరు – మన బడి” తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

Satyam NEWS

ఉప్పల్ లో బస్తీ దవాఖానలను ప్రారంభించిన వైద్య మంత్రి

Satyam NEWS

నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్ దాస్

Satyam NEWS

Leave a Comment