ములుగు జిల్లా ములుగు మండలంలో వరద నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు సోదరులలో బండారుపల్లికి చెందిన అల్లం శివాజీ మృతదేహం నేడు లభ్యం అయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి వెళ్లారు.
జంగాల పల్లి మధ్య నిన్న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వరద నీటికి కొట్టుకుపోయిన ఇద్దరిలో ఒకరి మృతదేహాన్ని ఎన్ డి ఆర్ ఎస్ బలగాలు బయటకు తీశాయి. ములుగు ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదంలో గల్లంతయిన శివాజీ సోదరుడు యువరాజు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యే సీతక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎంపీటీసీ మావురపూ తిరుపతి రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజన్న,శంకర్ మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.