కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో తడి చెత్త పొడి చెత్త వాహనాలను శుక్ర వారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వర్షాకాలం కావడంతో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మున్సిపాలిటీ వారు నగరవాసులకు ఇచ్చిన తడి చెత్త పొడి చెత్త బుట్టలో వేరువేరుగా తడి చెత్త పొడి చెత్త ను వేయాలని తెలిపారు. చెత్తను రోడ్లపై ఇతరాత్ర ఖాళీ ప్లాట్ల లో వేయరాదని చెత్తను మున్సిపాలిటీ వాహనాల సిబ్బంది కి అందజేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎడ్మ సత్యం.కౌన్సిలర్లు టీఆరెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు