రాజధాని గ్రామమై మందడంలో ఉదయం నుంచి బంద్ వాతావరణం నెలకొంది. మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి రైతులు వచ్చారు. పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేస్తున్నారు. తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని గ్రామస్తులు నిర్ణయించారు. తమ దుకాణాల ముందు సైతం పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్లటానికి వీల్లేదని రైతులు వెనక్కి పంపేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దుకాణాలు తెరవనీయకుండా రైతులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింప చేశారు.