ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ ల అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈరోజు ములుగు మండలంలోని రాయిని గుడేం, సర్వపూర్ గ్రామలలో జిల్లా సీనియర్ నాయకులు గండ్రకోట సుధీర్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ప్రతి సమస్య పరిష్కారం చేసి అండగా ఉండే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
బ్యాలెట్ పేపర్ లో 3 వ క్రమ సంఖ్య దగ్గర మొదటి అంకె వేసి బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వజ్జ రాజు,ఎంపీటీసీ సత్యం,సర్పంచ్లు పారిజాతం వెంకటస్వామి,రవీందర్,చెన్న విజయ్,ప్రదీప్,హరీష్,కవ్వంపెళ్లి బాబు ఉన్నారు.