కోనసీమ జిల్లా రాయవరం మండలంలో బుధవారం నదురుబాద గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి వారికి లక్ష పత్రి పూజ మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ధనుర్మస సందర్భంగా లక్ష తులసి పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముందుగా విశ్వక్షిన పూజ, మండపారాధన, స్వామివారికి పంచమృత అభిషేకాలు నిర్వహించారు. తదుపరి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సూర్యకుమారి దంపతులచే నూతన వస్త్రలు సమర్పణ జరిగింది. లక్ష బిల్వ పత్రి పూజ లక్ష తులసి పూజ హోమాలు నీరాజనం జరిగింది.
ఈ కార్యక్రమములో 30 మంది వేద పండితులు పాల్గొన్నారు. వారిలో అంగర శ్రీనివాసచార్యులు బృందం, విల్లూరి వీరభద్ర రావు బృందం ఉన్నారు.
మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గ రాణి, రాయవరం ఎం పి.పి. నౌడు వెంకటరమణ, జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతయారు వెంకటరెడ్డి,ఆలయం ఈవో అయ్యప్పరాజు, వైఎస్ఆర్సిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ఎంపీపీ సిరిపురపు శ్రీనివాసరావు దంపతులు,సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు, ఉండవల్లి శ్రీనివాసచౌదరి,మెర్ల రాంప్రసాద్ చౌదరి,చోడే ప్రసాద్,ఓదూరి సుబ్రహ్మణ్యం,సబ్బరపు వెంకటరమణ గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.