గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎంపిటిసిలకు జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిధులు మంజూరు చేయిoచారు.
ఈ సందర్భంగా జడ్పీ నిధుల ద్వారా మంజూరైన నిధులను తాండూరు నియోజకవర్గo లోని ఎంపిటిసిలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎంపిటిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జడ్పీ నిధుల ద్వారా మంజూరు అయిన నిధులను ఎంపీటీసీలు అందించడo జరిగిందన్నారు.
రాబోయే ఎమ్మెల్సీ నిధులు కూడా ఎంపీటీసీలకే కేటాయించి గ్రామాలను అభివృద్ధి పరుస్తామన్నారు. ఎంపీటీసీలకు నిధులు కేటాయించినందుకు జిల్లా ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేష్ చారి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.