ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం అదేవిధంగా ఒకే గ్రిడ్ అనే విజన్ను మనం గ్రహించగలిగితే.. అది సౌర ప్రాజెక్టులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 లీడర్స్ ఈవెంట్లో రెండో రోజు గ్రీన్ ఎనర్జీపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.
‘యాక్సిలరేటింగ్ క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ సౌరశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఎంత కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయో, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లగలమో ఒక్కసారి ఊహించుకోండి అని అన్నారు.