Slider ఆధ్యాత్మికం

వైభవంగా సాగుతున్న మోపిదేవి బ్రహ్మోత్సవాలు

mopidevi

కృష్ణా జిల్లా మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లి  దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు లో భాగంగా 4వ రోజు  శుక్రవారం ఉదయం నుండి స్వామివారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాలధారణ చేసిన స్వాములు పాల కావడీతో గ్రామం పురవీధులలో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి గంధం, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు ఇచ్చారు.

వాటితో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ని ప్రత్యేకంగా అలంకరించి వసంతోత్సవం, అవభృథస్నానోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్య మాల దీక్షా విరమణ కార్యక్రమం, పూర్ణాహుతి, శ్రీ స్వామివారి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో G.V.D.N లీలా కుమార్ , వేద పండితులు, అర్చక స్వాములు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

Related posts

ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్

Satyam NEWS

INTUC ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల పండుగ

Satyam NEWS

మంత్రాలయం వచ్చిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి

Satyam NEWS

Leave a Comment