కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మినహాయింపు పొందిన కేటగిరీలు మినహా అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. ఇప్పటి వరకు 50 శాతం అటెండెన్సుతో పనిచేస్తున్న ప్రైవేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని కోరారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జారీ చేసిన ఆర్డర్లో నగరంలోని రెస్టారెంట్లు, బార్లను మూసివేయాలని కూడా ఆదేశించింది. అయితే, రెస్టారెంట్లు హోమ్ డెలివరీ, టేక్అవే ఫుడ్ ఐటమ్స్ అనుమతించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే కేవలం 50 శాతం అటెండెన్సుతో మాత్రమే నడవాలని కూడా ఆదేశించారు.
previous post