టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జన్మదిన వేడుకలు సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మోత్కుపల్లి నరసింహులను మీర్పేట్ హెచ్.పీ కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ శాలువాతో ఘనంగా సన్మా నించారు.
ఈ సందర్భంగా ప్రభుదాస్ మాట్లాడుతూ మాజీ మంత్రిగా, శాసనసభ్యులుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషిచేసిన ఘనత మోత్కుపల్లి నరసింహులు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు,నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి