పొదలకూరు మండలంలోని తోడేరు గ్రామంలో ఆదివారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, పొదలకూరు సమితి మాజీ అధ్యక్షులు కాకాని రమణారెడ్డికి ఆయన రెండో వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. కాకాని రమణారెడ్డి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తండ్రి అన్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధాంజలి కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.