అధికార వైసీపీకి చెందిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారాన్ని మహిళా కమిషన్,లోక సభ స్పీకర్ కూడా సుమోటోగా తీసుకోవాలని తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.
ఎంపీ మాధవ్ వ్యవహారంపై విజయ సాయిరెడ్డి ట్వీట్ పెట్టే దమ్ము ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ రేప్ కేసులో నిందితుడని ఆమె తెలిపారు. ఇటువంటి ఐడియట్స్ ని చట్టసభలకు పంపకూడదు… కానీ వై ఎస్ జగన్ ఇలాంటి వారినే చట్టసభలకు పంపుతున్నారని ఆమె తెలిపారు.