ములుగు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో 24 మందితో కూడిన పూర్తి కమిటిని ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికను తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్, జిల్లా యూత్ అండ్ స్పోర్స్ట్ ఆఫీసర్ తుల రవి నిర్వహించారు. ఎన్నిక నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో భాగంగా అసోసియేషన్ అధ్యక్షునిగా ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జనరల్ సెక్రటరీగా కె కృష్ణ ప్రసాద్, అసోసియేషన్ సెక్రటరిగా నర్ర రఘువీర్, కోశాధికారిగా సంగ చేరాలు,
వైస్ ప్రెసిడెంట్లుగా పోసర వేణుగోపాల్, పైడాకుల అశోక్ , బలరాం రెడ్డి , సకినాల భవాని, మల్క రమేష్, వాసు దేవ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు గా అంబటి వినయ్, యాలం ఆదినారాయణ, అజ్మీర రాజు, సాయబోయిన బిక్షపతి, రామిడి కృష్ణారెడ్డి,
ఎగ్జిక్యూటీవ్ కమిటి మెంబర్లుగా దీప్తి , జయసింహా , గణేష్, జగదీశ్, సమ్మయ్య, సునిత, సామలత, నాగేంద్ర బాబు, శ్రీనివాస్ ఎన్నిక జరిగింది.