ములుగు జిల్లాలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్శాఖ సంసిద్ధమైంది. జిల్లాలోని సిబ్బందికి తోడు స్పెషల్ ఫోర్స్తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎస్ పి ప్రణాళిక రచించారు. ఎన్నికల వేళ డబ్బు, మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్ వంటివి తరలించే ముఠాలపై పోలీసులు నిఘా పెట్టమని, ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటికే అన్ని మండలాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేశామని ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.
రానున్న తెలంగాణ శాసన సభ ఎలక్షన్స్ నేపథ్యంలో సిబ్బందికి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేలా పలు అంశాలను జిల్లా అధికారులకు మార్గదర్శకాలను ఎస్ పి సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్గదర్శకాలు మరియు దాని అమలు తీరు, అంతర్ రాష్ట్ర మరియు అంతర్ జిల్లా చెక్ పోస్ట్లలో కఠినమైన తనిఖీలను నిర్వహించడం, ఎన్నికల నేరాల చట్టంలోని సెక్షన్లకు సంబంధించి స్పష్టత,VIP భద్రతా అంశాలు అవాలంభించవలసిన పద్ధతులను సూచించారు.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఏట్టిపరిస్థులలో రాజకీయనాయకులకు సెల్యూట్ వంటివి చేయరాదాని ఈసిఐ విధి విధానాలను మాత్రమే పాటించాలని సూచించారు. ములుగు జిల్లా మావోయిస్ట్స్ ప్రాబల్యం ఉన్నందున ఎన్నికల దృష్ట్యా LWE ముప్పును ఎదుర్కోవడం వంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఇంటలిజెన్స్ టీం తో పాటు రాష్ట్ర ఇంటలిజెన్స్ కూడా క్రియాశీలకంగా పనిచేస్తుందని తెలిపారు. అక్రమ మద్యం డెన్లపై దాడులు నిర్వహించాలని స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్ పి సూచించారు.
ఈ కార్యక్రమం లో ఏ ఎస్ పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ ఐ పి ఎస్ గారు, డి ఎస్ పి డి సి ఆర్ బి సుభాష్ బాబు, ఎస్ డి పి ఓ ములుగు రవీందర్, సి ఐ స్పెషల్ బ్రాంచ్ కిరణ్, సి ఐ సి సి ఎస్ దయాకర్,సి ఐ ములుగు రంజిత్ కుమార్, సి ఐ పస్రా శంకర్, సి ఐ ఏటూరునాగారం రాజు, సి ఐ వెంకటాపురం కుమార్, ఎస్ ఐ ములుగు, వెంకటాపూర్, పస్రా, ఏటూరునాగారం, మంగపేట,వెంకటేశ్వర్లు, చల్ల రాజు, షైక్ మస్తాన్, కృష్ణ ప్రసాద్, రవి కుమార్, ఎస్ ఐ తాజుద్దీన్ పాల్గొన్నారు.