కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో పరిశుభ్రత ముఖ్యమని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. కరోనా వ్యాధి లక్షణాలపై ఆయన నిరంతరంగా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. నేడు షేక్ పేట్ వినోబా నగర్ కాలనీల్లో పర్యటించిన ఆయన కరోనా వ్యాధిపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పలు కాలనీలలో స్వయంగా శానిటేషన్ పనులు చేశారు. HF నగర్ లో అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడ పేద వారికి నిత్యం ఆహారం అందే ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా నిరుపేదలకు రోజు రెండు పూటల భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో బాటు డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post