42.2 C
Hyderabad
April 30, 2024 18: 09 PM
Slider హైదరాబాద్

అన్నపూర్ణ క్యాంటిన్ ప్రారంభించిన మాగంటి గోపీనాథ్

Maganti Gopinath 151

కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో పరిశుభ్రత ముఖ్యమని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. కరోనా వ్యాధి లక్షణాలపై ఆయన నిరంతరంగా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. నేడు షేక్ పేట్ వినోబా నగర్ కాలనీల్లో పర్యటించిన ఆయన కరోనా వ్యాధిపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పలు కాలనీలలో స్వయంగా శానిటేషన్ పనులు చేశారు. HF నగర్ లో అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్కడ పేద వారికి నిత్యం ఆహారం అందే ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా నిరుపేదలకు  రోజు రెండు పూటల భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో బాటు డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లాలోవ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

Satyam NEWS

హిందువుగా జీవించు

Satyam NEWS

సోషల్ రెస్పాన్స్:ఫుట్‌పాత్‌పై బైకులు తెస్తే అంతే

Satyam NEWS

Leave a Comment