ములుగు జిల్లా లో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ కోరారు. ఈ మేరకు తమకు సాయం అందించాలని బీఎస్పీ అధ్యక్షులు ఆర్. యెస్. ప్రవీణ్ కుమార్ మద్దతును ఆయన కోరారు. ములుగు జిల్లా ప్రాంత వాసుల రవాణా సౌలభ్యం కోసం ములుగు జిల్లా లో బస్ డిపో ఏర్పాటు చేయటంలో సహకరించాలని ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ అన్నవరం బీఎస్పీ అధ్యక్షులు ఆర్. యెస్. ప్రవీణ్ కుమార్ ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు.
బహుజన రాజ్యాధికార యాత్ర లో భాగంగా బుధవారం ఇంచెర్ల విచ్చేసిన బీఎస్పీ అధ్యక్షులు ఆర్. యెస్. ప్రవీణ్ కుమార్ ని కలిసి ములుగు జిల్లా ప్రజల సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ములుగు జిల్లా కు వాహన రిజిస్ట్రేషన్ కోడ్ కేటాయించినప్పటికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోవడం వల్ల ములుగు జిల్లా ప్రజలు భూపాలపల్లి కి వెళ్లి రావాల్సి వస్తుందని తెలిపారు. ములుగు ప్రాంతం అభివృద్ధి లో చాలా వెనక పడింది అని, కనీస అవసరం అయిన రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు అని, రాత్రి వేళలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వరంగల్ కేంద్రానికి రాకపోకల కి జిల్లా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన కి వివరించారు.
ఈ సందర్భంగా బీఎస్పీ అధ్యక్షులు ఆర్. యెస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతం అయిన ములుగు కి ప్రజల రవాణా దృష్ట్యా బస్ డిపో అవసరం ఉంది అని, డిపో ఏర్పాటు కు, రవాణా శాఖ కార్యాలయం, మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.