ఒకప్పుడు ఉత్తరాంధ్ర లోని మూడు జిల్లాల్లో కంచుకోట గా ఉన్న టీడీపీ కి అనంతరం జరిగిన పరిణామాలలో ఆ పార్టీ అథోగతి పాలైంది. పడీ పడి లేస్తూ వస్తున్న టీడీపీ కి…ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల… అగ్ని పరీక్ష అనే చెప్పాలి.
తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా విజయనగరంలో రింగ్ రోడ్డు భాష్యం స్కూల్ ఎదురుగా ఉన్న ప్రాధమిక పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే,వైఎస్సార్సీపీ ఉత్త రాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే కేంద్ర మాజీమంత్రి ,విపక్ష టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు..సాలిపేట,39వ డివిజన్, గురజాడ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్ లో నిల్చున్న అశోక్ గజపతిరాజు వెంట సునీల గజపతి రాజు, కూతురు టీడీపీ నియోజక వర్గ ఇన్ చార్జి అదితి గజపతిరాజులతో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.