కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి తెలంగాణ మున్నూరు కాపు (కాపు) సంఘం చేయూతనిస్తున్నది. శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు (కాపు)నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ మున్నూరు కాపు (కాపు) సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, NIMS హాస్పిటల్ పరిసరాలలో నేడు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
వద్దిరాజు రవిచంద్ర పటేల్, కొండ దేవయ్య పటేల్, అల్లం కిషన్ రావు పటేల్ సహకారంతో ఫఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం, శ్రీ కృష్ణా నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
కరోనా మహమ్మారి తో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాయిస్ స్టూడియో ఎండి కొత్త లక్ష్మణ్ పటేల్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం మహిళా కన్వీనర్ బండి పద్మ, కాపు నాయకులు కాసర్ల రమేష్ నాయుడు,
శేరి లింగంపల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ వాసాల వెంకటేశ్వర్లు పటేల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోఆర్డినేటర్ వాసాల రాజు పటేల్, హఫీజ్ పేట్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మంగళరపు తిరుపతి పటేల్, గౌరవ అధ్యక్షులు పెరుక రమేష్ పటేల్, శ్రీకృష్ణ నగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పెరుక రవీందర్ పటేల్, గంప సురేష్ పటేల్, మంగళరపు రజినీకాంత్ పటేల్, ఆకుల నరసయ్య పటేల్, కాషెట్టి వెంకటేష్ పటేల్, బత్తుల రవిపటేల్ కూన శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.