గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో దారుణ హత్య జరిగింది. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెం లో గన్నెబొయిన గంగిరాజు యాదవ్(52)ని ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. వీరు రాజకీయ ప్రత్యర్ధులా లేక స్థానికంగా వేరే విషయంలో గొడవ జరిగిందా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఒకే సామాజిక వర్గానికి మధ్య వచ్చిన విభేదాలు నేపథ్యంలో ఈ హత్య జరిగింది అని స్థానికుల సమాచారం. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.