ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా మేడే ఉత్సవాల్లో భాగంగా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనుబంధ యూనియన్ల జెండాలను ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ఆవిష్కరించారు.
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాముల శివారెడ్డి,డిసిసిబి డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు,మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,ఆటో వర్కర్స్ యూనియన్,రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్,బిల్లింగ్ వర్కర్స్ యూనియన్,హమాలి వర్కర్స్ యూనియన్,సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్,జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఐ ఎన్ యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి.సామ్యవాద జీవన సాధనలో కదలిరండి అని,కార్మిక చట్టాలు సంఘటిత ఉద్యమాలు చేయాలని, నిత్యవసర ధరలు,డీజిల్,పెట్రోల్ ధరల పెరుగుదల వలన కార్మికులు, అసంఘటిత కార్మికులు,పేద ప్రజల జీవితాలు చితికిపోతున్నాయని అందుకే మరొక కార్మిక హక్కుల సాధన ఉద్యమం నడపాలని ప్రపంచ కార్మిక దినోత్సవ మేడే సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,బెల్లంకొండ గురవయ్య,కరుణాకర్ రెడ్డి,సలిగంటి జానయ్య, మేళ్లచెరువు ముక్కంటి, పాశం రామరాజు,చింతకాయల రాము, పోతబోయిన రామ్మూర్తి, చప్పిడి సావిత్రి, బెంజిమెన్, సులువు చంద్రశేఖర్,వేముల నాగరాజు,వెంకటేశ్వర్లు,మేకపోతుల వీరబాబు,షేక్ హుస్సేన్,కె.రవీందర్, ప్రసాద్, రాము, తోట లక్ష్మయ్య,యడవెల్లి వీరబాబు,బిక్షం,గడ్డం నాగయ్య, సుమతి,నరసింహారావు,సైదులు, మాల్సూర్ అలీ,జానీమియా, నాగేశ్వరరావు ఐ ఎన్ టి యు సి కార్మికులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్