నల్గొండ జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం లో వెలసిన ధూళ్ళగుట్ట స్వయంయుక్త శ్రీ బాల ఉగ్రనారసింహా స్వామి దేవాలయం అభివ్రుద్ది చేయటానికి లతీఫ్ ముందుకు వచ్చి కమిటి లో సభ్యునిగా చేరారు. ఈ సంధర్భంగా లతీఫ్ మాట్లాడుతు ఎంతో మంది హిందువులు దర్గాలు, మసీదులు, చర్చి లు వెల్లి ప్రార్దనలు చేస్తుండటం అభినందనీయం అని దేవుడు ఎక్కడ ఉన్న ఒకటే రూపం అని మనుషులను మనుషులుగా చూసే ప్రతి ఒక్కరు దేవుడి రుపాలేనని తెలిపారు. లతీఫ్ ఒక్కరే కాకుండా గ్రామానికి చెందిన అనేకమంది ముస్లిం లు, క్రిస్టియన్ లు డొనేషన్ లు ప్రకటించటం గ్రామం లోని ప్రజల ఐకమత్యానికి నిదర్శనం. ఈ సందర్భంగా కలిసిన లతీఫ్ ని పలువురు అభినందించటం జరిగింది.
previous post
next post