తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ తెరాస నాయకుల చెప్పు చేతుల్లో పని చేస్తున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గురువారం దుబ్బాక నియోజికవర్గం తోగుట మండలం లో మిని కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను తెరాస నాయకులు అడ్జుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని డీకే అరుణ ప్రశ్నించారు.
పోలీసులకు ఈ విషయం పై ఎమ్మెల్యే రఘునందన్ ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ , పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీని పై పోలీసులను ప్రశ్నిస్తే తమ వద్ద సిబ్బంది కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటని డీకే అరుణ అన్నారు. తెరాసలో కార్పొరేషన్ చైర్మన్ లకు, అధికార హోదాలు లేని వారికి ఎస్కార్ట్ ఇచ్చేందుకు సిబ్బంది కొరత ఉండదని డీకే అరుణ ఎద్దేవా చేసారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మెల్యే కు బందోబస్తు కల్పించడం లో విఫలమైన వారి పై చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.