40.2 C
Hyderabad
May 2, 2024 17: 08 PM
Slider మెదక్

టీఆర్ఎస్ నేతల చెప్పు చేతల్లో తెలంగాణ పోలీసు వ్యవస్థ

#d k aruna

తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ తెరాస నాయకుల చెప్పు చేతుల్లో  పని చేస్తున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. గురువారం దుబ్బాక నియోజికవర్గం తోగుట మండలం లో మిని కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను తెరాస నాయకులు అడ్జుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని డీకే అరుణ ప్రశ్నించారు. 

పోలీసులకు ఈ విషయం పై ఎమ్మెల్యే రఘునందన్  ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ , పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని,  దీని పై పోలీసులను ప్రశ్నిస్తే తమ వద్ద సిబ్బంది కొరత ఉందని చెప్పడం సిగ్గుచేటని డీకే అరుణ అన్నారు. తెరాసలో కార్పొరేషన్ చైర్మన్ లకు, అధికార హోదాలు లేని వారికి ఎస్కార్ట్ ఇచ్చేందుకు సిబ్బంది కొరత ఉండదని డీకే అరుణ ఎద్దేవా చేసారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఎమ్మెల్యే కు బందోబస్తు కల్పించడం లో  విఫలమైన వారి పై చర్యలు తీసుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేసారు.

Related posts

మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలి

Satyam NEWS

రోడ్ వైడనింగ్ పేరుతో దోపిడి చేస్తున్న వైసీపీ నేతలు

Satyam NEWS

మిమ్మల్ని కన్న తల్లి ఒక ఆడది అని మరిచారా నరరూప రాక్షసులరా

Satyam NEWS

Leave a Comment