కరోనా కష్ట సమయంలో పేదల కరోనా రోగులకు మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ తన సేవలను కొనసాగిస్తున్నది.
కరోనా రోగులతో బాటు చెక్ పోస్టు వద్ద డ్యూటీ చేస్తున్న పోలీసు సిబ్బందిని నేడు మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ అన్నదానం చేసింది.
కరోనాతో ఇబ్బంది పడుతూ ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల ఆకలి తీర్చేందుకు గత 13 రోజులుగా మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ ఆహారం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో శ్రమపడి వాహనాలు, వాహనదారులను నియంత్రించి కరోనా వ్యాప్తిని ఆపేందుకు శ్రమిస్తున్న చెక్ పోస్ట్ వద్ద డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి కూడా నేడు ఆహారాన్ని సరఫరా చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమములో మై వేములవాడ చారిటెబుల్ ట్రస్ట్ సభ్యులు కుమ్మరి శంకర్, నాగుల చంద్ర శేఖర్, నాగుల నరేందర్ హాస్పిటల్ బిమయ్య పాల్గొన్నారు.