తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ విధానాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సమర శంఖం పూరించారు.
సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికినం.. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవు అని ఆమె వ్యాఖ్యానించారు. ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి అంటూ ఆమె సవాల్ విసిరారు.
నేను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపాను. ఉద్యమంలో ఈటెల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..? నా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారు.
ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగండి అంటూ ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు.
నా ఆస్తులు అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటా. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమే అని ఆమె స్పష్టం చేశారు.
అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పొరపాటు. నా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారు అని ఆమె ఆవేదన చెందారు.
ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా అని ఈటల జమున ప్రశ్నించారు.