33.2 C
Hyderabad
May 4, 2024 01: 30 AM
Slider కరీంనగర్

11వ రోజు ఆహారం అందించిన మై వేములవాడ వాట్సప్ గ్రూప్

#vemulawada 1

కరోనా బాధితులకు సాయం చేయడంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నది.

11వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ సెంటర్లో కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందికి అల్పాహారం మధ్యహ్నం భోజనం అందించారు.

అక్కడి కోవిడ్ టెస్ట్ సెంటర్లో ఉన్న వైద్య సిబ్బందికి కూడా నేడు భోజనం సమకూర్చారు.

మై వేములవాడ వాట్సాప్ గ్రూపు తరఫున వేములవాడ లో లాక్డౌన్ పూర్తి అయ్యేవరకూ ప్రతీరోజు  అల్పాహారం,  భోజనం అందించనున్నట్లు గ్రూపు సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్, మధు మహేష్, నూగూరి మహేశ్, కముటాల రాజు,   గొంగళ్ల రవికుమార్,  రంగుల శ్రీనివాస్ , నాగుల చంద్రశేఖర్,బస్వరాజు పాల్గొన్నారు.   

Related posts

పెద్దకొత్తపల్లిలో ఈ నెల 20న యాదవుల సదర్ పండుగ

Satyam NEWS

చైనాతో కుమ్మ‌క్కు.. ఓలికి మ‌ళ్ళీ ప‌ట్టం క‌ట్టేరా?

Sub Editor

నిన్న రామ‌తీర్ధం..ఇవాళ చీపురుప‌ల్లి… పండ‌గ సంద‌ర్బంగా విజయనగరం ఎస్పీ దైవ ద‌ర్శ‌నాలు

Satyam NEWS

Leave a Comment