మహాశివరాత్రి సందర్భంగా ఏపీలోని విజయనగరం జిల్లా లోని రామతీర్దం కోదండ రామాలయంతో పాటు శివాలయాన్ని దర్శించిన ఎస్పీ…గోత్ర నామాలతో పూజలు నిర్వహించారు. అలాగే శివరాత్రి సందర్బంగా రామతీర్దంలో శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తును దగ్గరుండీ పరిశీలించి చివరకు ఎలాంటి ఘటనలను జరగకుండా ప్రశాంతంగా పూర్తి చేసారు..
తాజాగా అదే జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గమైన చీపురుపల్లిలో శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి జాతర సందర్బంగా ఎస్పీ దీపిక.. అమ్మవారిని దర్శించుకున్నారు. పండగ సందర్భంగా పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గత మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలకు భద్రతా చర్యలు చేపట్టారు.
అంతకుముందు జిల్లా ఎస్పీ కి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈమేరకు ఎస్పీకి ఆశీర్వచనం, తీర్థ, ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డిఎస్పీ .మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, చీపురుపల్లి సీఐ సంజీవరావు, ఎస్ఐ సన్యాసి నాయుడు, నీలావతి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.