ఇబ్రహీంపట్నం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, ఆధ్యాత్మిక, సామాజికవేత్తగా పేరుగాంచిన రెవరెండ్ మైలమాల శ్యాంసుందర్ కు గౌరవ డాక్టరేట్ సత్కారం అంగరంగ వైభవంగా జరిగింది. ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ ఆఫ్ ఇండియా మరియు బెసలేల్ ఏపీస్కోపల్ డయాసిస్ వారి ఆధ్వర్యంలో బిషప్ దేవరపల్లి ఏలియారాజు,డాక్టరు వేశపోగు జయకిషోర్,బిషప్ కొడాలి లాజర్ ల చేతుల మీదుగా,కంకిపాడు ప్రార్ధన మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న ఆధ్యాత్మిక,సామాజిక,సేవా కార్యక్రమాలను గుర్తించి శ్యాంసుందర్ కు గౌరవ డాక్టరేట్ ప్రధాన చేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మైలవరం, పెనమలూరు, నందిగామ, విజయవాడ నియోజవర్గం పరిధిలోని క్రైస్తవనాయకులు,దైవసేవకులు,కుటుంబసభ్యులు,పలు ఎన్జీవోల ప్రతినిధులు,తదితరులు అభినందనలు తెలిపారు.