మేడ్చల్ జిల్లాలోని జవహర్నగర్లో ఇద్దరు యువతులు, ఒక బాలిక చనిపోయిన సంఘటనలో క్లారిటీ వచ్చింది. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతులు చనిపోగా కొద్ది దూరంలో ఒక బాలిక మృత దేహం ఉదయం లభించాయి.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా చిక్కుముడి త్వరగానే వీడిపోయింది. ఈ వివరాలను ఏసీపీ శివకుమార్ మీడియాకు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువతులు సుమతి, రేవతి. వీరిద్దరూ స్నేహితులు. రేషన్ బియ్యం కోసం వెళ్లి ఇంటికి ఆలస్యంగా రావడంతో వారి భర్తలు మందలించారు.
దాంతో మనస్తాపం చెంది రెండు రోజుల కిందట జవహర్నగర్కు వచ్చేశారు. రెండు రోజులుగా చర్చిలోనే ఉన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. సుమతికి కూతురు ఉంది. పేరు ఉమామహేశ్వరి. చిన్నారికి కూల్డ్రింక్లో హార్పిక్, ఆలౌట్ కలిపి తాగించారు. చిన్నారి చనిపోయాక ఇద్దరూ చున్నీలతో చెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని శివకుమార్ తెలిపారు.