37.2 C
Hyderabad
April 30, 2024 13: 02 PM
Slider ఆదిలాబాద్

ఎలర్ట్: కలసికట్టుగా కరోనా వైరస్ తరిమేద్దాం

Nirmal SP 131

నిర్మల్ జిల్లా ప్రజలు కలిసికట్టుగా కరోనా వైరస్ ను నిర్మల్ జిల్లా నుండి తరిమి వేసేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కూడళ్లను ద్విచక్రవాహనంపై జిల్లా పోలీస్ అధికారులు, స్పెషల్ గార్డులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంపూర్ణ నిర్మల్ జిల్లా ప్రజల నుండి పూర్తిగా సహకారం లభిస్తుందని ఈ నెల 30 వరకు కూడా ఇలాగే ప్రజలు ఇళ్ల నుండి అనవసరంగా బయటకు రాకుండా నిర్బంధాన్ని నిర్మించుకోవాలని అన్నారు. దగ్గు జలుబు జ్వరం తదితర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఈనెలాఖరు వరకు నిర్మల్ జిల్లాను కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ పట్టణ/గ్రామీణ సిఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐలు వెంకటి, కృష్ణ ఆంజనేయులు, యంటిఓ వినోద్, ఆర్ఎస్ఐలు దేవేందర్, మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏప్రిల్ 1 న విడుదలవుతున్న “సేవాదాస్”లో నటించడం మాకు గర్వంగా ఉంది!!

Satyam NEWS

సర్వమత సామారస్యాన్ని పాటిస్తున్న తెలంగాణ

Satyam NEWS

మత్స్యకారులకు అధునాతన డీప్ సి బోట్స్ అందించండి

Bhavani

Leave a Comment