విజయనగరం జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఉదయాన్నే మోర్నింగ్ వాక్ లో భాగంగా పచ్చదనం కార్యక్రమంతో పాటు నగరంలో నాడు-నేడు కార్యక్రమంలో కొత్తపేట గొల్లవీధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తొలుత 22 లక్షలతో చేపట్టిన పాఠశాల ఆధునీకరణ కొత్త భవనాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నేత రాజేష్ తో కలిసి పరిశీలించారు.
అలాగే పక్కనే పచ్చదనం లో భాగంగా 50 మొక్కలను కలెక్టర్ ఈ సందర్భంగా నాటారు. ఈ ప్లాంటేషన్ లో అటవీశాఖ సోషల్ విభాగపు ఆఫీసర్ జానకీరామ్, నగర ప్లాంటేషన్ రవి ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.