గాంధీ నగర్ లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా పద్మనరేష్, టీఆర్ఎస్ నేతలు ముఠా జైసింహ, ఎమ్మెల్సీ కవిత గారితో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు.
అనంతరం నామినేషన్ వేసేందుకు గాను, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మనరేష్, టీఆర్ఎస్ నాయకులు అబిడ్స్ సర్కిల్ ఆఫీస్ కార్యాలయానికి బయల్దేరారు.