వైసీపీ వివాదాస్పద నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై జనసేన నాయకుడు నాగబాబు సెటైర్ వేశారు. విజయ సాయీ మాస్క్ గొంతుకు కాదు ముక్కుకు నోటికి పెట్టుకోవాలి అని నాగబాబు చెప్పారు. ముక్కుకు మూతికి మాస్క్ అడ్డం పెట్టుకుంటే ప్రజలు తనను గుర్తుపడతారో లేదోనని పాపం విజయ సాయి రెడ్డి ఆందోళన చెందుతున్నట్లుగా ఉందని, అతడిని ప్రజలు గుర్తుపడతారనే గ్యారెంటీ తాను ఇస్తున్నానని నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
previous post