38.2 C
Hyderabad
April 29, 2024 12: 07 PM
Slider మహబూబ్ నగర్

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి

#jupally

హైదరాబాద్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వాసులను నేడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి, కొల్లాపూర్ మండలాలకు చెందిన వారు హైదరాబాదులోని నిమ్స్, హైదరాబాద్ కిడ్నీ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు.

కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన సులిగిరి వెంకటేశ్వర్లు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత నొప్పితో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని హైదరాబాద్ కిడ్నీ సెంటర్ కు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి బాధితుని పరామర్శించారు.

అదేవిధంగా చిన్నంబావి మండల పరిధిలోని చిన్నదగడ గ్రామానికి చెందిన భక్కి చిన్నయ్య గత నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడి కాలు విరిగిన సందర్భంగా ఇతర ఆసుపత్రులకు వెళ్లాడు. అయినా గాయం మనకపోవడంతో జూపల్లి సూచనతో నేడు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో జూపల్లి ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించి చికిత్సకు సంబంధించిన విషయాలపై సంబంధిత వైద్యులను అడిగి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించిన జూపల్లి అధైర్య పడవద్దని ప్రభుత్వ సహకారం అందేలా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. వారితో పాటు ఆయా గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ లో కొత్తదేవుడు ఇప్పుడు కేసీఆర్

Satyam NEWS

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Bhavani

అమరావతి రైతులు కొత్త సంవత్సరం జరుపుకోవద్దు

Satyam NEWS

Leave a Comment