28.7 C
Hyderabad
May 6, 2024 01: 06 AM
Slider నిజామాబాద్

ఆర్థిక సహాయం కోరిన గుండె బాధితుని మృతి

#nagallaramesh

కామారెడ్డి మున్సిపాలిటీలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన గుండె బాధితుడు నాగళ్ల రమేష్ మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసిన రమేష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ కాచిగూడ టీఎక్స్ ఆస్పత్రిలో చేరారు. గుండెకు ఆపరేషన్ తప్పనిసరి కావడంతో అపన్నహస్తం కోసం కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సత్యం న్యూస్ లో సైతం ‘ఆర్థిక సహాయం కావాలి.. గుండె బాధితుని కుటుంబం వేడుకోలు’ అనే శీర్షికన వార్త కూడా ప్రచురితం కావడంతో దాతలు ముందుకు వచ్చి తోచిన విధంగా సహాయం చేసారు. అయినా బాధితుడు చికిత్స పొందుతూ నేడు మృత్యువాత పడ్డాడు. రమేష్ మృతి వార్త గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య శ్యామల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS

స్వామీ అయ్యప్పా ఈ వివాదాలు నిన్ను ఆపగలవా?

Satyam NEWS

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Satyam NEWS

Leave a Comment