కామారెడ్డి మున్సిపాలిటీలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన గుండె బాధితుడు నాగళ్ల రమేష్ మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసిన రమేష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ కాచిగూడ టీఎక్స్ ఆస్పత్రిలో చేరారు. గుండెకు ఆపరేషన్ తప్పనిసరి కావడంతో అపన్నహస్తం కోసం కుటుంబ సభ్యులు వేడుకున్నారు. సత్యం న్యూస్ లో సైతం ‘ఆర్థిక సహాయం కావాలి.. గుండె బాధితుని కుటుంబం వేడుకోలు’ అనే శీర్షికన వార్త కూడా ప్రచురితం కావడంతో దాతలు ముందుకు వచ్చి తోచిన విధంగా సహాయం చేసారు. అయినా బాధితుడు చికిత్స పొందుతూ నేడు మృత్యువాత పడ్డాడు. రమేష్ మృతి వార్త గ్రామంలో దావానంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య శ్యామల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
previous post