శబరిమల లో నెలకొని ఉన్న స్వామి అయ్యప్ప ఆలయానికి గత 28 రోజుల్లో రూ .104 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఒక రికార్డు. గతేడాది ఈ కాలంలో కేవలం రూ.64 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అనేక వివాదాలు రేపిన వారికి ఇది ఒక గుణపాఠంగా అయ్యప్ప భక్తులు భావిస్తున్నారు.
వివాదాల నడుమ అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుందేమోనని అందరూ అనుకున్నారు కానీ భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం అయ్యప్ప మహిమకు తార్కాణమని అంటున్నారు. కేవలం నాణాల రూపంలోనే సుమారు రూ.5 కోట్లు వచ్చాయి. మిగిలినవన్నీ నోట్లే.
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు రావడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఆలయ ఆదాయం, భక్తుల సంఖ్య పెరగడం పట్ల దేవస్థానం అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పండుగ సీజన్లో ఆలయ ఆదాయం మొదటి 28 రోజుల్లో రూ .104 కోట్లు దాటడం ఒక రికార్డని వారు వెల్లడించారు.
ఆలయంలో రెండు నెలల సెషన్ నవంబర్ 17 న ప్రారంభమైంది. గత సంవత్సరం 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలను ఆలయంలోకి ప్రవేశించడంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత చాలా వివాదాలు ఉన్నాయి. అవన్నీ అయ్యప్ప మహిమ ముందు పని చేయలేదు.
అప్పం లేదా అరవన్ (పాయసం) ను నైవేద్యంగా అమ్మడం ద్వారా ఆదాయం లభిస్తుంది. ఇది కూడా గణనీయంగా పెరిగింది. ఆలయానికి చేరే మార్గంలో నీలక్కల్ నుంచి సున్నిధనం మధ్య రోప్వే ప్రారంభించాలని ప్రతిపాదించామని ట్రావెన్కోర్ దేవ్సోమ్ బోర్డు అధ్యక్షుడు ఎన్.వాసు చెప్పారు. దీనితో పాటు, పంబా నుండి సన్నిధనన్ మధ్య రోప్వే నిర్మాణం కూడా జరుగుతోంది.