సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూరుగడ్డ గ్రామం లోని శ్రీ సంతాన నాగేంద్ర సహిత పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరమేశ్వరునికి పవిత్రమైన కార్తీక మాసం సోమవారం,నాగులచవితి పర్వదినం కావటంతో గ్రామం లోని భక్తులు,చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు వేకువజామున ఆలయం వద్దకు చేరుకుని పుట్టలో పాలు పోసి,పొంగళ్ళు వండి స్వామివారికి నివేదించారు.అనంతరం శ్రీ సంతాన నాగేంద్ర సహిత పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో,పంచసూక్త విధానంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయం అనువంశిక చైర్మన్ మంత్రిప్రగడ వెంకటేశ్వర రావు దంపతులు,దేశ్ ముఖ్ అరుణ్ కుమార్ దంపతులు,అర్చకులు ద్రోణా బలరామ శర్మ,విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్