సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో డి.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు ఆధ్వర్యంలో పబ్లిక్ క్లబ్ దగ్గర మహాత్మా జ్యోతిబా ఫూలే 130వ, వర్ధంతిని పురస్కరించుకొని DSR ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం బాబురావు మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేశారని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడిని,బానిసత్వం రూపుమాపటం కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతి బాపూలే అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు కోలపూడి డేవిడ్, దగ్గుపాటి సత్యానందం, సింగారపు సైదులు, చింతమల్ల ప్రసాద్, కోలపూడి కళ్యాణ్,ఎస్ కే నిరంజన్, అమరబోయిన వెంకటేశ్వర్లు, ఆర్. వాసు, ములకలపల్లి నరసింహారావు, వి.సూర్యం, తదితరులు పాల్గొన్నారు.