31.2 C
Hyderabad
May 3, 2024 02: 12 AM
Slider అనంతపురం

గంజాయిపై నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ పోరాటం

#Anantapur district

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గంజాయి వద్దు బ్రో అంటూ నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ క్యాంపెయిన్ చేశారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్ర లో భాగంగా గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న క్యాప్ ధరించి యువత కు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అంటూ మెసేజ్ ఇచ్చారు.

గంజాయి వద్దు బ్రో అని రాసి ఉన్న టీ షర్టులు, క్యాపులు ధరించిన యువత, టిడిపి నాయకులు, తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు, టిడిపి కార్యకర్తలు, వాలంటీర్లు పాదయాత్రలో పాల్గొన్నారు. గంజాయి కి ఏపి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అంటూ గత 63 రోజులుగా డ్రగ్స్ సంస్కృతి కి వ్యతిరేకంగా లోకేష్ పోరాటం చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి తిరుమల ని కూడా వైసిపి గంజాయి మాఫియా వదలడం లేదు అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల లో గంజాయి అమ్ముతున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు అని లోకేష్ అన్నారు. గంజాయి వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. టిడిపి హయాంలో 40వేల కోట్ల రూపాయిలు విలువ చేసే గంజాయి ని తగలబెడితే ఇప్పుడు ఏకంగా వైసిపి నాయకులు గంజాయి పంట వేస్తున్నారు.

పాదయాత్ర లో ఉండగా చంద్రగిరి లో ఒక తల్లి వచ్చి తన కుమార్తె గంజాయి కి బానిస అయ్యింది అని చెప్పింది. ఆ సంఘటన నన్ను కలచివేసింది. అందుకే గంజాయి కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం అని లోకేష్ తెలిపారు. టిడిపి హయాంలో పెట్టిన డిఎడిక్షన్ సెంటర్లు కూడా వైసిపి ప్రభుత్వం నిర్వీర్యం చేసారు. యువత అంతా డ్రగ్స్, గంజాయి కి దూరంగా ఉండాలి అని పిలుపు ఇస్తున్నా. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసిపి గంజాయి మాఫియా పై చర్యలు తీసుకుంటాం. గంజాయి వద్దు బ్రో… యువత గంజాయి కి దూరంగా ఉండాలి అంటూ లోకేష్ పిలుపు ఇచ్చారు.

Related posts

డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ

Bhavani

డింపుల్…. డింపుల్ ఎంతపని చేశావు?

Satyam NEWS

ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టి‌ఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక

Satyam NEWS

Leave a Comment