యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపును కాంక్షిస్తూ హుజూర్ నగర్ పట్టణంలోని విద్యాసంస్థలలో ప్రచారం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యరగని నాగన్న గౌడ్,TPCC జాయింట్ సెక్రెటరీ ఎండీ అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను మేధావులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయ మేధావి వర్గం ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు.
గడిచిన ఏడు సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పరిగణలోనికి తీసుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి మద్దతుతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్లు జిల్లాల నుండి కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడుగు బలహీన వర్గాల కార్మిక సంఘ నాయకుడు రాములు నాయక్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 16 వ వార్డు కౌన్సిలర్ కారింగుల విజయ వెంకటేశ్వర్లు, పల్లపు పెద్దబ్బాయి, యూత్ కాంగ్రెస్ నాయకులు కుక్కల వెంకన్న, కుక్కడపు వినోద్, పులి బాలకృష్ణ, టి. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.