వన్య ప్రాణులు, అటవీ సంపద, పర్యావరణం తదితర అంశాలలో కో కరిక్యులమ్ యాక్టివిటీలో భాగంగా కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్ధులతో అటవీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ వనదర్శిని కార్యక్రమంలో దాదాపు 68 మంది విద్యార్ధులు పాల్గొని అటవీ శాఖ అధికారులతో అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. కళాశాల విద్యార్ధులకు పాడి పరిశ్రమ, సోలార్ విద్యుత్, మొక్కలు, అడవి, వన్య ప్రాణులపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవి శాఖ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్ ఇ రామరాజు యాదవ్, వైస్ ప్రిన్సిపాల్ ఎం మదన్ మోహన్, లెక్చరర్లు ఎం. మద్దిలేటి, ఎం.కురుమయ్య, సి.రమేష్ కుమార్, ఆర్ రాముడు, డి శివుడు, కె జగన్నాథం, వసుంధర తదితరులు పాల్గొన్నారు.