కోవిడ్ సమయంలో ఎంతో శ్రమించి విధులు నిర్వహించిన ప్రకాశం జిల్లా కారంచేడు కు చెందిన డాక్టర్ భాస్కర్ రావు కరోనా సోకి తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లోకి వెళ్లగా ఆయనను గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదుకున్నారు.
ఉన్న ఆస్తి మొత్తం అమ్మి 50 లక్షల రూపాయలు ఖర్చు చేసినా డాక్టర్ భాస్కరరావు ఆరోగ్యం కుదుటపడలేదు దాంతో ఆ విషయాన్ని స్థానిక డాక్టర్ ల వాట్స్ యాప్ గ్రూప్ లో పోస్టు చేశారు. ఈ పోస్టుకు స్పందినిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరావు తో ఈ విషయం మాట్లాడారు.
ఆయన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లటంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు.
ముఖ్యమంత్రి చేసిన సహాయం గొప్పదని మహాత్మ గాంధీ ఆసుపత్రి అధినేత డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ శ్రీరామినేని సుధీర్ తో కలిసి మాట్లాడారు.
సమావేశం అనంతరం డాక్టర్ సుధీర్ స్టార్ ఇమేజెస్ నుండి రెండు లక్షలు, కడియాల హాస్పిటల్ నుండి లక్ష రూపాయలు ఐఎంఏ అసోసియేషన్ కి చెక్కులను అందజేశారు.